మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారానికి అలెక్సీ నావల్నీ ఎంపిక .
జైలు జీవితం గడుపుతున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని యురోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత పురస్కారం వరించింది. మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారాన్ని నావల్నీకి ప్రకటించారు. ఈ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు (దాదాపు రూ.43.59 లక్షలు) అందజేయనున్నారు.
మానవహక్కులపై నావల్నీ రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఈయూ తెలిపింది. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర రూపాల్లో నావల్నీ నిరంతర ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమీకరించారు.’ అని పేర్కొంది.