తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది. 2020-21 జీఎస్డీపీ అంచనా రూ.9,78,373 కోట్లు.. తలసరి ఆదాయం అంచనా రూ.2,27,145 కోట్లు
ప్రధానాంశాలు:
- రాష్ట్ర బడ్జెట్ మొత్తం - రూ.2,30,825.96 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు
- క్యాపిటల్ వ్యయం - రూ.29,046.77 కోట్లు
- రెవెన్యూ మిగులు - రూ.6,743.5 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.6 కోట్లు
తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2021-22ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనా మొత్తం రూ.2,30,825.96 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.5 కోట్లు, ఆర్థిక లోటు అంచనా రూ.45,509.6 కోట్లుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆ మహమ్మారి విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రాకతో ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతోందని అన్నారు. ఇక వివిధ రంగాలకు ప్రభుత్వం కేటాయించిన పద్దు వివరాలు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ సమగ్ర స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)
అంశం | 2020–21 బడ్జెట్ అంచనా | 2020–21 సవరించిన అంచనా | 2021–22 బడ్జెట్ అంచనా |
మొత్తం బడ్జెట్ | 1,82,914.42 | 1,66,728.91 | 2,30,825.96 |
పన్ను ఆదాయం | 85,300 | 76,195.65 | 92,910 |
పన్నేతర ఆదాయం | 30,600 | 19,305.58 | 30,557.35 |
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ | 10,525.36 | 10,525.36 | 38,669.46 |
కేంద్ర పన్నుల్లో వాటా | 16,766.58 | 11,371.25 | 13,990.13 |
రుణాలు | 34,000 | 43,784 | 47,500 |
ద్రవ్య లోటు | 33,191.25 | 42,399.85 | 45,509.60 |
మూలధన వ్యయం | 22,061.18 | 10,561.18 | 29,046.77 |
2021-22 బడ్జెట్ హైలెట్స్
* రాష్ట్ర బడ్జెట్ మొత్తం - రూ.2,30,825.96 కోట్లు
* రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు
* క్యాపిటల్ వ్యయం - రూ.29,046.77 కోట్లు
* రెవెన్యూ మిగులు - రూ.6,743.5 కోట్లు
* ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.6 కోట్లు
ప్రధాన రంగాలు, సంక్షేమానికి ఇలా..
- వ్యవసాయ రంగం - రూ.25 వేల కోట్లు
- సాగునీటి రంగం - రూ.16,931 కోట్లు
- డబుల్ బెడ్ రూం ఇళ్లు - రూ.11 వేల కోట్లు
- విద్యుత్ రంగం - రూ.11,046 కోట్లు
- ఆసరా పెన్షన్లు - రూ.11,728 కోట్లు
- వైద్యారోగ్య శాఖ- రూ. 6,295 కోట్లు
- హోంశాఖ - రూ.6,465 కోట్లు
- బడ్జేటేతర నిధులతో కలిపి ఆర్టీసీకి - రూ.3 వేల కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ - రూ.2,750 కోట్లు
- పౌరసరఫరాల శాఖ - రూ. 2,363 కోట్లు
- కొత్త సచివాలయం నిర్మాణం - రూ.610 కోట్లు
- పశు సంవర్ధక, మత్స్యశాఖ - రూ.1,730 కోట్లు
- అటవీశాఖకు రూ.1,276 కోట్లు
- మెట్రో రైలు ప్రాజెక్టు - రూ.1000 కోట్లు
- సమగ్ర భూ సర్వే రూ.400 కోట్లు
- సాంస్కృతిక పర్యాటక శాఖ రూ.726 కోట్లు
- దేవాలయాల అభివృద్ధి, అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమం - రూ.720 కోట్లు
విద్యారంగంలో కేటాయింపులు ఇలా..
- పాఠశాల విద్య - రూ.11,735 కోట్లు
- విద్యారంగ అభివృద్ధికి కొత్త పథకం - రూ.4 వేల కోట్లు
- ఉన్నత విద్య - రూ.1,873 కోట్లు
హైదరాబాద్, ఇతర నగరాల అభివృద్ధి కోసం..
- ఉచిత మంచినీటి సరఫరా - రూ. 250 కోట్లు
- సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు - రూ. 725 కోట్లు
- మూసీ నది పునరుజ్జీవం కోసం, సుందరీకరణ - రూ. 200 కోట్లు
- ఓఆర్ఆర్ పరిధిలోని కాలనీల తాగునీటి సరఫరా - రూ. 250 కోట్లు
- వరంగల్ కార్పొరేషన్ - రూ. 250 కోట్లు
- ఖమ్మం కార్పొరేషన్ - రూ. 150 కోట్లు
పట్టణాల అభివృద్ధికి..
- పట్టణ ప్రగతి - రూ.500 కోట్లు
- పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణం - రూ.200 కోట్లు
- ప్రతి పట్టణంలో గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు - రూ.500 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపు ఇలా..
- సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ - రూ.1000 కోట్లు
- ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి - రూ.21,306.85 కోట్లు
- ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి - రూ. 12,304. 23 కోట్లు
- నేతన్నల సంక్షమం - రూ.338 కోట్లు
- బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ - రూ.1000 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖ - రూ.5,522 కోట్లు
- మైనార్టీ గురుకులాల నిర్వహణ - రూ.561 కోట్లు
- మైనార్టీ సంక్షేమం - రూ. 1,606 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి..
- షీ టాయిలెట్లకు - రూ.10 కోట్లు
- మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు - రూ.3 వేల కోట్లు
- మొత్తంగా మహిళా, శిశు సంక్షేమం - రూ.1,702 కోట్లు
ఇతర ప్రాజెక్టుల కోసం..
- రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ - రూ.750 కోట్లు
- పౌర విమానయాన అభివృద్ధి - రూ. 100 కోట్లు
- తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల, జిల్లా పరిషత్లకు - రూ.500 కోట్లు
- ఇందులో జిల్లా పరిషత్లకు రూ.252 కోట్లు, మండల పరిషత్లకు - రూ.248 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ - రూ. 29,271 కోట్లు
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రూ.5 కోట్లు
పరిశ్రమలు, రహదారులు, భవనాల నిర్మాణాలకు..
- పరిశ్రమల రాయితీ - రూ.2,500 కోట్లు
- పరిశ్రమల శాఖ - రూ.3,077 కోట్లు
- ఆర్ అండ్ బీ రోడ్లు - రూ.800 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లు - రూ.300 కోట్లు
- సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్మాణం - రూ.725 కోట్లు
- ఆర్వోబీ, ఆర్యూబీల - రూ. 400 కోట్లు