20వ శతాబ్దపు మొదటి భాగంలో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పరిచిన కొన్ని గ్రంథాలయాల వివరాలు..

 

1) 1910- ఆంధ్రభాషా నిలయం, ఖమ్మం

2) 1913-ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం,వరంగల్‌

3) 1913-సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం, సికింద్రాబాద్‌

4) 1918- రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయం, హైదరాబాద్‌. దీనిని రాజా బహదూర్‌ వెంకటరామి రెడ్డి చొరవతో స్థాపించారు.

5) 1918- ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం, నల్లగొండ

6) 1918- ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, సూర్యాపేట, నల్లగొండ జిల్లా.

7) 1920- భాషాకల్పవల్లి గ్రంథాలయం, సికింద్రాబాద్‌

8) 1923- బాల సరస్వతి గ్రంథాలయం, హైదరాబాద్‌ (అఫ్జల్‌గంజ్‌)

9) 1923- వేమన ఆంధ్రభాషా నిలయం, హైదరాబాద్‌

10) 1923- ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం, ఖమ్మం

11) 1923- ఉస్మానియా భాషా నిలయం, కరీంనగర్‌

12) 1923- జగదీశ్వర్‌ గ్రంథాలయం, జగిత్యాల

13) 1923- ఉస్మానియా తెలుగు గ్రంథాలయం, మంథెన

14) 1923- నీలగిరి గ్రంథాలయం, నల్లగొండ

15) 1923- దక్షిణ ఆనంద గ్రంథాలయం, సంగారెడ్డి

16) 1924- ప్రతాపరుద్రాంధ్ర భాషానిలయం, మడికొండ

17) 1925- ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం, హైదరాబాద్‌

18) 1926- ఆదిహిందూ లైబ్రరీ, హైదరాబాద్‌

19) 1926- దక్కన్‌ వైశ్యసంఘం గ్రంథాలయం

20) 1930- జోగిపేట గ్రంథాలయం, మెదక్‌

21) 1941- రైతు గ్రంథాలయం, చిలుకూరు, నల్లగొండ జిల్లా. దీనిని రావి నారాయణ రెడ్డి స్థాపించారు.