తెలంగాణ రాష్ట్ర సాధన - ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.


ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ కమిటీ నియమించారు.


కె.ఎస్​.థార్​ కమిషన్​:
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించేందుకు భారత ప్రభుత్వం 1948లో ఈ కమిషన్​ నియమించింది.


జె.వి.పి కమిటీ: కె.ఎస్​.థార్​ కమిషన్​ నివేదికను పరిశీలించేందుకు జేవీపీ కమిటీని 1948లో నియమించారు.


పండిత్​ సుందర్​లాల్​ కమిటీ: జె.ఎన్​.చౌదరి పాలనలో కమ్యూనిస్టులు, ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం 1949లో నియమించింది.


ఎ.డి.గోర్వాలా కమిటీ: హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం 1950లో ఈ కమిటీని నియమించారు.


పింగిళి జగన్మోహన్​ రెడ్డి: సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీస్​ కాల్పులపై 1952లో ఈ కమిటీ నియమించారు.


వాంఛూ కమిటీ:
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వచ్చే సమస్యలు పరిశీలించేందుకు 1953లో ఈ కమిటీ నియమించారు.


ఫజల్​ అలీ కమిషన్​: రాష్ట్రాల పునర్విభజనకు శాశ్వత ప్రాతిపదికత కల్పించుటకు ఈ కమిటీని 1953లో నియమించారు.


తెలంగాణ ప్రాంతీయ కమిటీ: పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 1958లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.


కుమార్​ లలిత్​ కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు లెక్కించడానికి 1969లో ఈ కమిటీని నియమించారు.


వశిష్ట భార్గవ కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.


కె.ఎస్​.వాంఛూ కమిటీ: ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని 1969లో నియమించారు.


తార్కుండే కమిటీ:
నక్సలైట్లపై జరిగిన బూటకపు ఎన్​కౌంటర్లపై విచారణకు 1977లో ఈ కమిటీని నియమించారు.


జయభారత్​ రెడ్డి కమిటీ: రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి 1984లో నియమించారు.


సుందరేషన్​ కమిటీ: జయభారత్​ రెడ్డి నివేదికలోని అంశాలు పరిశీలించుటకు 1985లో ఈ కమిటీని నియమించారు.


హితన్​భయ్యా కమిటీ: విద్యుత్​ రంగంలో సంస్కరణల కోసం 1998లో ఈ కమిటీని నియమించారు.


గిర్​గ్లానీ కమిషన్​: 610 జీవో, ఆరు సూత్రాల పథకం అమలు తీరు పరిశీలించేందుకు ఈ కమిటీని 2001లో నియమించారు.


ప్రణబ్​ ​ముఖర్జీ కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం 2005లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.


రోశయ్య కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి 2009లో ఈ కమిటీ ఏర్పాటు చేశారు.


జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ:
ఆంధ్రప్రదేశ్​లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం, సూచనల కోసం 201‌‌0లో ఈ కమిషన్​ను నియమించారు.


ఆంటోని కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధివిధానాల రూపకల్పనకు 2013లో ఈ కమిటీ నియమించారు.


కమలనాథన్​ కమిటీ: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన సూచించడానికి 2014లో ఈ కమిటీని నియమించారు.


ప్రత్యూష సిన్హా కమిటీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో సివిల్​ సర్వీసెస్​ ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఈ కమిటీని నియమించారు.


హరగోపాల్​ కమిటీ: టీఎస్​పీఎస్​సీ పరీక్షల సిలబస్​ రూపకల్పనకు ఈ కమిటీని 2015లో నియమించారు.