సుందర్లాల్ బహుగుణ – చిప్కో ఉద్యమం (1973)
- ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారులు సుందర్లాల్ బహుగుణ కొవిడ్తో మరణించారు.
- 94ఏళ్ల వయసున్న సుందర్లాల్ బహుగుణ ఇటీవలి కాలం వరకు హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడారు.
- 1970ల్లో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు.
- 1980ల్లో తెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
- కేంద్ర ప్రభుత్వం ఆయనని 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
- ఇది అడవుల నరికివేతకు (Deforestation) వ్యతిరేకంగా సాగిన ఉద్యమం
- చిప్కో అనగా చెట్లను హత్తుకోవడం
- ఇది ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయ ప్రాంతంలో గల ఛమోలి జిల్లాలోని మండల్ గ్రామంలో ప్రారంభమైంది.
- దీనిలో పాల్గొన్న ఉద్యమకారులు – సుందర్లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్
- సుందర్లాల్ బహుగుణ ఒక గాంధేయవాది, తత్త్వవేత్త
- ఈ ఉద్యమంలో ఛిర్ఫైన్ (పైనస్ రాక్స్ బర్గై) అనే వృక్షాల నరికివేతను అడ్డుకున్నారు.
- మొదటిసారిగా పర్యావరణ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టారు.
- ఇందులో అనేక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొనడం వల్ల ఒక నూతన భావన. ‘Eco feminism’ వెలుగులోకి వచ్చింది.
- ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ – గౌరీదేవి (Mahila Mangal Dal)
- దీనిలో పాల్గొన్న ఇతర మహిళలు – ధూమ్ సింగ్ నేగి, బచ్నీ దేవి.
- దీని పాల్గొన్న సంస్థ – దసోలి గ్రామ స్వరాజ్య సంఘ
- అప్పటి యూపీ సీఎం హేమవతి నందన్ బహుగుణ వేసిన కమిటీ ఉద్యమకారులకు అనుకూలంగా నివేదికను ఇచ్చింది.
- దీనివల్ల తర్వాత దేశంలో వచ్చిన అనేక ఉద్యమాలకు చిప్కో స్ఫూర్తినిచ్చింది.
- ఈ ఉద్యమం వల్ల చండీప్రసాద్ భట్కు వచ్చిన అవార్డ్ – రామన్ మెగసెసె (1982)
- ఈ ఉద్యమం వల్ల సుందర్లాల్ బహుగుణకు వచ్చిన అవార్డ్ – పద్మ భూషణ్ (2009)
- చిప్కో ఉద్యమానికి వచ్చిన అవార్డ్ – Right Livelihood Awared
- చిప్కో ఉద్యమంపై పాటను రాసిన కవి – ఘన్శ్యామ్ రాథూరి