- టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు కొనసాగాయి.
- ఒలింపిక్స్ను జపాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించారు.
- 2020 ఒలింపిక్స్ను 2021లో నిర్వహించారు. కరోనా వల్ల ఏడాది పాటు వాయిదా వేశారు.
- శీతాకాల ఒలింపిక్స్ను 1972లో సపోరోలో, 1998లో నగానోలో నిర్వహించారు.
- ఒలింపిక్స్ను రెండుసార్లు నిర్వహించిన తొలి ఆసియా వేదికగా టోక్యో ఘనత సాధించింది.
అగ్రస్థానంలో అమెరికా: పతకాల సాధనలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం మొత్తం 113 పతకాలను దక్కించుకుంది. ఇందులో 39 బంగారు, 41 వెండి, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. రెండో స్థానంలో చైనా నిలిచింది. భారత్ 48వ స్థానంలో ఉంది.
భారత్: భారత్ తరఫున ప్రారంభ
వేడుకల్లో పతాకధారులుగా మేరీ కోమ్, మన్ప్రీత్ సింగ్లు నిలిచారు.
ముగింపు వేడుకలకు బజ్రంగ్ పూనియా పతాకధారి.
భారత విజేతలు
- నీరజ్ చోప్రా స్వర్ణం (జావెలిన్ త్రో)
- మీరాబాయి చాను వెండి (వెయిట్ లిఫ్టింగ్)
- రవి దహియా- రజతం (రెజ్లింగ్)
- లవ్లీనా బోర్గోహెయిన్- రజతం (బాక్సింగ్)
- పీవీ సింధు- రజతం (బ్యాడ్మింటన్)
- బజ్రంగ్ పూనియా- రజతం (రెజ్లింగ్)
- భారత హాకీ జట్టు- రజతం